2019-20 మధ్య రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా భాజపాకు రూ.785 కోట్లు అందాయి. ఈ మొత్తం కాంగ్రెస్కు అందిన విరాళాల కన్నా ఐదు రెట్లు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి రూ.139 కోట్లు రాగా.. తృణమూల్ కాంగ్రెస్కు రూ.8 కోట్లు, సీపీఐకి రూ.1.3 కోట్లు, సీపీఐ(ఎం)కు రూ.19.7 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇటీవల ఈ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నాయి.
భాజపాకు అందిన విరాళాల్లో అత్యధికంగా ఎలక్టోరల్ ట్రస్ట్లు, కార్పొరేట్ సంస్థలు, పార్టీ నేతల నుంచి ఉన్నాయి. నేతల్లో పీయూష్ గోయల్, పెమా ఖండు, కిరణ్ ఖేర్, రమణ్ సింగ్లు ఎక్కువ విరాళాలు ఇచ్చారు.