తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2022, 4:16 PM IST

ETV Bharat / bharat

'పంజాబ్ ఇష్యూ'పై భాజపా నయా గేమ్​ప్లాన్​.. టార్గెట్ కాంగ్రెస్!

BJP nationwide campaign against Congress: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భారీ భద్రతా వైఫల్య వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇదే అజెండాగా కాంగ్రెస్​ను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్​తో ముందుకు సాగుతోంది భాజపా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఉద్యమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు భాజపా నేతలు.

BJP plans nationwide campaign against Cong
BJP plans nationwide campaign against Cong

BJP nationwide campaign against Congress: పంజాబ్​ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్​ భద్రతా లోపాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం భాజపా- కాంగ్రెస్​ మధ్య చిచ్చురేపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది భాజపా. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా.. జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.

Modi Security Breach: శుక్రవారం దిల్లీలోని రాజ్​ ఘాట్​(మహాత్మాగాంధీ స్మారకం) వద్ద మౌన దీక్ష చేపట్టారు భాజపా ఎంపీలు. 'భారత్​ స్టాండ్స్​ విత్​ పీఎం మోదీ' అని ఉన్న ప్లకార్డులు పట్టుకొని రెండు గంటలసేపు నిరసన తెలియజేశారు. పంజాబ్​ కాంగ్రెస్​ ప్రభుత్వం దేశానికి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.

భాజపా ఎంపీల నిరసన దీక్ష
దిల్లీ రాజ్​ఘాట్​ వద్ద భాజపా ఎంపీల మౌనదీక్ష
భారత్​ స్టాండ్స్​ విత్​ పీఎం మోదీ అని ప్లకార్డులు పట్టుకున్న ఎంపీలు

అన్ని రాష్ట్రాల్లో రాజ్​భవన్​లకు నిరసనగా వెళ్లి మెమోరాండం సమర్పించాలని.. భాజపా వ్యూహాలు సిద్ధం చేసింది.

గుజరాత్​లో భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​ నేతృత్వంలోని బృందం.. గవర్నర్​ ఆచార్య దేవ్​వ్రతాను కలిసి మెమోరాండం సమర్పించింది. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు అందించాల్సిందిగా కోరారు నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ కూడా గవర్నర్​ను కలిసిన బృందంలో ఉన్నారు.

బంగాల్​ భాజపా బృందం గవర్నర్​ జగదీప్​ ధనకర్​ను కలిసి మెమోరాండం అందజేసింది.

బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​కు మెమోరాండం సమర్పిస్తున్న భాజపా నేతలు

గోవాలోని భాజపా బృందం.. గురువారమే గవర్నర్​ శ్రీధరన్​ పిళ్లైని కలిసింది. మోదీ భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పంజాజ్​ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు.

దేశవ్యాప్తంగా నిరసనలు..

BJP Attacks Congress: కాంగ్రెస్​ను కార్నర్​ చేసేందుకుగానూ.. దేశవ్యాప్తంగా వరుస నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని భాజపా యోచిస్తోంది.

ప్రధాని భద్రత విషయంలో పంజాబ్​ ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపిస్తున్న భాజపా.. ఈ విషయమై కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని నిర్ణయించింది.

భాజపా యువజన విభాగం ఆధ్వర్యంలో.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా గురువారం కొవ్వొత్తుల ర్యాలీలు కూడా జరిగాయి.

భాజపా యువజన విభాగం కొవ్వొత్తుల ర్యాలీ

BJP workers lathi-charged:

ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన కొందరు భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లోని తిల్హర్​లో జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

PM Punjab Incident:

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేపట్టిన పంజాబ్​ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. భద్రతా వైఫల్యం కారణంగా.. ఆయన కాన్వాయ్​ సుమారు 20 నిమిషాలపాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. అక్కడినుంచి వెంటనే దిల్లీకి పయనమయ్యారు. మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సుదీర్ఘకాలం జీవించాలని పలు ప్రాంతాల్లో భాజపా నేతలు గురువారం పూజలు, యాగాలు చేశారు.

20 నిమిషాల పాటు రోడ్డుపైనే నిలిచిపోయిన మోదీ కాన్వాయ్​

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్​ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా మరో త్రిసభ్య కమిటీని నియమించింది.

సుప్రీంలో విచారణ..

మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ప్రధాని ప్రయాణ రికార్డులను వెంటనే భద్రపరచాలని పంజాబ్- హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఇది కేవలం శాంతిభద్రతల అంశం కాదని, స్పెషల్​ ప్రొటక్షన్​ గ్రూప్​ చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్​ తరఫు న్యాయవాది. ఉన్నతస్థాయి అధికారులతో దర్యాప్తు చేపట్టాలని కోరారు.

ఇవీ చూడండి:'మోదీ పంజాబ్ ఘటన'పైనే కేబినెట్ చర్చ.. విచారణకు త్రిసభ్య కమిటీ

మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలపై సుప్రీం కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details