తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో భాజపా ఎంపీ కన్నుమూత - కరోనాతో భాజపా ఎంపీ కన్నుమూత

మధ్యప్రదేశ్​లోని ఖండ్వా పార్లమెంట్​ సభ్యుడు నంద్​ కుమార్​ సింగ్​ చౌహాన్​.. దిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకగా ఆయన అక్కడ చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయారు. నంద్​కుమార్​ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ విచారం వ్యక్తం చేశారు.

Nand Kumar Singh Chauhan passed away
కరోనాతో భాజపా ఎంపీ కన్నుమూత

By

Published : Mar 2, 2021, 10:36 AM IST

మధ్యప్రదేశ్​లోని ఖండ్వా భాజపా ఎంపీ నంద్​ కుమార్​ సింగ్​ చౌహాన్​ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం నంద్​ కుమార్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. మేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం తుది శ్వాస విడిచారు.

ప్రధాని సంతాపం

నంద్​ కుమార్​ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్​లో భాజపాను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు. నంద్​ కుమార్​ కుటుబం సభ్యులకు సంతాపం తెలిపారు.

"ప్రజాదరణ పొందిన నేత నందూ భయ్యా మమ్మల్ని వీడి వెళ్లారు. ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని, అంకితభావంతో ఉన్న నేతను భాజపా కోల్పోయింది. నంద్​ కుమార్ మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు" అని శివరాజ్​ సింగ్ చౌహాన్​​ తెలిపారు.

ఇదీ చూడండి:'కన్నది మీరైతే.. ప్రభుత్వం ఖర్చులు భరించాలా?'

ABOUT THE AUTHOR

...view details