తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2020, 4:20 PM IST

ETV Bharat / bharat

'గుప్కర్​ అలియన్స్'పై భాజపా ధ్వజం

జమ్ముకశ్మీర్​లోని గుప్కర్​ అలియన్స్​ (స్థానిక పార్టీల కూటమి)తో కాంగ్రెస్​ కలవడంపై విమర్శలు గుప్పించింది భాజపా. ఆర్టికల్​ 370, జాతీయ పతాకంపై ఆ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్​ కట్టుబడి ఉంటుందా? అని ప్రశ్నించింది. రాహుల్​ గాంధీపైనా విమర్శలు చేసింది.

BJP attacks Congress over Gupkar Alliance
'గుప్కర్​ అలియన్స్'​తో కాంగ్రెస్​ పొత్తుపై భాజపా విమర్శలు

జమ్ముకశ్మీర్​లోప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపించింది భాజపా. ఆర్టికల్​- 370 పునరుద్ధరణ సహా ఇతర వివాదాస్పద డిమాండ్లు​ చేస్తోన్న పాకిస్థాన్​ వంటి దేశాల మాదిరిగానే వీరి వైఖరి ఉందని ఆరోపించింది.

నేషనల్​ కాన్ఫరెన్స్​, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీలు గుప్కర్​ అలియన్స్​గా ఏర్పడగా.. ఆ పక్షాలతో కాంగ్రెస్​ జట్టుకట్టడంపై విమర్శలు గుప్పించారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర. రాహుల్​ గాంధీపైనా ఆరోపణలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా నుంచి ఆర్జేడీ నేత శివానంద తివారీ, కాంగ్రెస్​ నేత కపిల్​ సిబల్​ సైతం రాహుల్​పై విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఒబామాకు రాహుల్​ కేవలం నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే తెలిస్తేనే అలా అన్నారంటే.. రాహుల్​తో రోజూ ఉండే వారికి ఆయన గురించి పూర్తిగా తెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేతలు రాహుల్​ గాంధీని ప్రశంసించే సమయంలో 100 టన్నుల రాయిని తమ ఛాతిపై మోసేవారని, ఇప్పుడు వారు ఊపిరి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు సంబిత్​ పాత్ర.

" భాజపా చాలా కాలంగా అదే చెబుతోంది. కాంగ్రెస్​కు మంచి నమ్మకస్తుడైన శివానంద తివారీనే ఇప్పుడు అతను (రాహుల్​) పని చేయని పిక్నిక్​ ప్రెసిడెంట్​ అని చెబుతున్నారు. గుప్కార్​ అలియన్స్​ అనేది అపవిత్రమైనది. భారత పార్లమెంట్​ ఆమోదించిన చట్టాలను వ్యతిరేకించటమే దాని లక్ష్యం. పాకిస్థాన్​ సహా భారత వ్యతిరేఖ దేశాలు కోరుకునేదే గుప్కార్​ అలియన్స్​ కోరుకుంటుంది. పాకిస్థాన్​ ప్రతి అంతర్జాతీయ సమావేశానికి వెళ్లి ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించింది. గుప్కార్​ అలియన్స్​ కూడా అదే చేస్తోంది."

- సంబిత్​ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి.

గుప్కార్​ అలియన్స్​ నేతలు చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటారా? అని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలను ప్రశ్నించారు సంబిత్​. ఈ సందర్భంగా.. ఆర్టికల్​ 370కి చైనా మద్దతుగా నిలిచిందని నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు, కశ్మీరీ జెండాను తిరిగి తీసుకొచ్చే వరకు జాతీయ పతాకాన్ని ఎత్తబోనని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్న మాటలను గుర్తు చేశారు.

ఇదీ చూడండి:భాజపాకే వ్యతిరేకం.. భారత్​కు కాదు: ఫరూక్​

ABOUT THE AUTHOR

...view details