జవాన్ల ప్రాణాలను కాపాడేందుకు దిల్లీలో బైక్ అంబులెన్స్ను నేడు ప్రారంభంచినున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, దంతేవాడ వంటి అటవీ ప్రాంతాల్లో ఎన్కౌంటర్లలో గాయాలపాలయ్యే జవాన్ల అత్యవసర చికిత్స కోసం 'రక్షిత' అనే బైక్ అంబులెన్స్లను తయారుచేశారు. వీటిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లీడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని దిల్లీలో నేడు ప్రారంభించనున్నారు.
జవాన్ల ప్రాణాలకు శ్రీరామ రక్ష.. బైక్ అంబులెన్స్ - రక్షిత బైక్ అంబులెన్స్
యుద్ధ రంగంలో గాయపడే భద్రతా సిబ్బంది అత్యవసర వైద్యానికి ఉపయోగపడేలా బైక్ అంబులెన్స్లను రూపొందించారు. సీఆర్పీఎఫ్, ఇన్మాస్, డీఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'రక్షిత'ను నేడు దిల్లీలో ప్రారంభించనున్నారు.
రక్షిత.. ఇదొక బైక్ అంబులెన్స్!
నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, ఇరుకైనదారుల్లో సులువుగా చేరుకునేలా ఈ బైక్ అంబులెన్స్ను రూపొందించారు. ఈ అడవుల్లో సమయానికి వైద్యం అందక సామాన్య ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇదీ చదవండి:మొదటి స్వదేశీ మెషీన్ గన్ అభివృద్ధి