తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2022, 6:00 PM IST

ETV Bharat / bharat

అందుకు ఒప్పుకోలేదని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి!

Father killed daughter: కన్న తండ్రే ఆ కూతురు పాలిట కాలయముడిగా మారాడు. తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోనందుకు ఏకంగా ఆ యువతి గొంతు కోసి ప్రాణం తీశాడు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది.

Father allegedly kills daughter for refusing to marry man of his choice
అందుకు ఒప్పుకోలేదని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి!

Father killed daughter: బిహార్​లోని గోపాల్​గంజ్​ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతుర్ని గొంతు కోసి హత్య చేశాడు. ఈ విషయాన్ని మృతురాలి తల్లి పోలీసులకు వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది..

బిహార్​ గోపాల్​గంజ్​లో ఉండే కిరణ్​ కుమారి అనే 19 ఏళ్ల అమ్మాయి.. తన గ్రామంలో ఉండే ఓ యువకుడితో స్నేహపూరితంగా ఉండేంది. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. ఇది తెలుసుకున్న కుమారి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు. ఇందుకోసం మసాన్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఉండే బిర్చా గ్రామానికి చెంది నాతి శర్మ అనే అబ్బాయితో పెళ్లి చేసేందుకు నిశ్చియించాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె తండ్రి ఇంద్రదేవ్​ ఆదివారం మద్యం తాగి సోదరులతో కలిసి ఇంటికి వచ్చాడు.

నిందితుడు ఇంద్రదేవ్​

అనంతరం కూతురు చేతులు, కాళ్లు కట్టేసి గొంతు కోసినట్లు అధికారులు మృతురాలి తల్లి కళావతి పోలీసులకు వివరించింది. దీనిని అడ్డుకోబోయినందుకు గానూ.. ఆమెపై కూడా నిందితులు దాడికి దిగినట్లు వివరించింది. కత్తితో గాయపరిచినట్లు పేర్కొంది.

మృతురాలి ఇంటి వద్ద స్థానికులు

ఈ రోజు ఉదయం స్థానికంగా.. ఉండే పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసిన కళావతి.. జరిగింది అంతా పోలీసులకు వివరించింది. ఆమె వాంగ్మూలంతో అధికారులు ఇంద్రదేవ్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేశారు. వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్​

ABOUT THE AUTHOR

...view details