తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

సరదా కోసం చేసే ప్రాంక్​ను ప్రమాదకరంగా మార్చి జనాలను భయభ్రాంతులకు గురిచేసిన ఏడుగురు ఆకతాయిలను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కొరివి దెయ్యంలా వేషం వేసుకుని స్థానికులను భయపెట్టినందుకు తీవ్రంగా హెచ్చరించారు.

By

Published : Nov 12, 2019, 11:47 AM IST

Updated : Nov 12, 2019, 2:41 PM IST

పోలీసుల అదుపులో 'సరదా కొరివి దెయ్యాలు'..!

ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

సరదాగా పక్కవారిని ఏడిపించి నవ్వుకోవడం మంచిదే. కానీ సరదా శ్రుతిమించితే? ఈ బెంగళూరు ఆకతాయిలకు ఎదురైన అనుభవమే మిగులుతుంది. జనాల చెవిలో పూలు పెడదామనుకుని వెళ్లి పోలీసులకు చిక్కారు ఏడుగురు యువకులు. ఇంతకీ వీరి దెయ్యం వేషాలేమిటో చూద్దాం..

వెర్రివాళ్లను చేయడమే పని

ఆర్​టీ సిటీకి చెందిన షాన్ మాలిక్, నవీద్, సాజిల్ మొహమ్మద్, మహ్మద్ అకుబ్, సాకిబ్, సయ్యద్ నబిల్, యూసుఫ్ అహ్మద్​ ఓ బృందం. వీరు సరదాగా ప్రాంక్​ వీడియోలు చేస్తూంటారు. ఎవరికీ కనబడకుండా కెమెరాను ఉంచుతారు. దారిలో వెళ్లేవారిని భయపెట్టి, పిచ్చి ప్రశ్నలు వేయడం వంటివి చేసి వారిని వెర్రివాళ్లను చేస్తుంటారు.

భయపెడదామని వెళ్లి..

ఎప్పటిలాగే.. యశ్వంత్​పురలోనూ ప్రాంక్​ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ బృందంలోని కొందరు అర్ధరాత్రి.. తెల్లని గౌను ధరించి, విగ్ పెట్టుకుని కొరివి దెయ్యంలా తయారయ్యారు. రోడ్డుపై అందరిని భయపెట్టడం మొదలుపెట్టారు. వీరి ప్రాంక్​లకు భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇలా ప్రజలను భయపెట్టి.. వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్​ చేసి, డబ్బులు ఆర్జించే ఆ ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:వంట గదిలోని పొగ పీల్చితే గుండెపోటు!

Last Updated : Nov 12, 2019, 2:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details