తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షోర్​ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ-జిన్​పింగ్​ - latest news on mahabalipuram summit

మహాబలిపురంలోని ప్రముఖ షోర్​ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

xi modi

By

Published : Oct 11, 2019, 7:13 PM IST

Updated : Oct 11, 2019, 8:05 PM IST

షోర్​ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ-జిన్​పింగ్​

రెండో అనధికారిక సదస్సు సందర్భంగా భారత్​, చైనా దేశాధినేతలు... మహాబలిపురంలోని సముద్ర ముఖంవైపు ఉన్న షోర్​ ఆలయాన్ని సందర్శించారు. యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ఆలయంలో ప్రధాని మోదీ, చైనా అధినేత షి జిన్​పింగ్​ కలియతిరిగారు.

మొదట ఆలయానికి చేరుకున్న ఇద్దరు నేతలకు ఆహ్వానం పలికారు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​, భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. ప్రముఖుల సందర్శన నేపథ్యంలో ఆలయాన్ని ఎల్​ఈడీ దీపాలతో అలంకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇద్దరు దేశాధినేతలు వీక్షించారు.

అంతకుముందు అర్జున పెనాన్స్​, పంచ రథాలను దర్శించారు.

ఇదీ చూడండి: జిన్​పింగ్​కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ

Last Updated : Oct 11, 2019, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details