తెలంగాణ

telangana

'సోనియాకు లేఖ రాయడం సరికాదు'

కాంగ్రెస్​ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి సీనియర్ నేతలు రాసిన లేఖపై స్పందించారు దిగ్విజయ్ సింగ్. అన్ని విషయాలను అంతర్గతంగా చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

By

Published : Aug 26, 2020, 6:50 PM IST

Published : Aug 26, 2020, 6:50 PM IST

Writing letter to Sonia Gandhi was not proper: Digvijaya Singh
'సోనియాకు లేఖ రాయడం సరైనా ఆలోచన కాదు'

కాంగ్రెస్​కు సారథి ఎంపికపై కొందరు నేతలు సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని సీనియర్ నేత దిగ్విజయ్​ సింగ్​ తప్పుబట్టారు. ఇటువంటి సమయంలో ఆమెకు లేఖ రాయడం మంచి పని కాదన్నారు.

"నేను సీడబ్ల్యూసీ సభ్యుడిని కాదు. లేఖను చూడలేదు. కానీ లేఖ రాయడం, ఇలాంటి విషయాలు మీడియాకు లీక్​ చేయడం సరికాదు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలోని ఏ సభ్యుడైనా కమిటీ ముందు చర్చించాలని కోరవచ్చు "

- దిగ్విజయ్ సింగ్​

కాంగ్రెస్ నాయకత్వ మార్పు విషయమై చర్చించేందుకు సీడబ్ల్యూసీ భేటీ అయింది. ఈ క్రమంలో పార్టీకి క్రియాశీలంగా, పూర్తిస్థాయిలో ఉండే నాయకత్వం కావాలంటూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాశారు. ఈ లేఖ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి నియంత్రణలో ఎన్​95 భేష్!'

ABOUT THE AUTHOR

...view details