తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏఎన్​-32 విమాన శకలాలు 8 రోజులకు గుర్తింపు

8 రోజుల క్రితం అదృశ్యమైన ఏఎన్​-32 విమానం ఆచూకీ లభించింది. అరుణాచల్​ ప్రదేశ్​లోని లిపో ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించారు.

By

Published : Jun 11, 2019, 4:20 PM IST

Updated : Jun 11, 2019, 5:21 PM IST

ఏఎన్​-32 విమాన శకలాలు 8 రోజులకు గుర్తింపు

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్​-32 విమాన ఆచూకీ లభించింది. 8 రోజుల గాలింపు తర్వాత... అరుణాచల్​ ప్రదేశ్​లోని లిపో ప్రాంతంలో ఈ విమాన శకలాలను ఎంఐ-17 హెలికాప్టర్​ ద్వారా గుర్తించారు. విమానం బయల్దేరిన ఎయిర్​బేస్​ నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఈ శకలాలు ఉన్నాయి.

జూన్​ 3న అసోంలోని జోహ్రత్​ ఎయిర్​ బేస్​ నుంచి బయల్దేరింది ఏఎన్​-32 విమానం. చైనా సరిహద్దు సమీపంలోని మెన్​చుక వద్ద దిగాల్సి ఉంది. కానీ గాల్లోకి ఎగిరిన కొద్దిక్షణాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో అందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.

ఇదీ చూడండి:13 మంది సహా భారత యుద్ధ విమానం గల్లంతు

Last Updated : Jun 11, 2019, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details