తెలంగాణ

telangana

ETV Bharat / bharat

​​​​​​​సరయూ నదీ తీరాన.. ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం! - సరయూ నదీ తీరాన ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం

రాముడు నడయాడిన అయోధ్యపురిలో 251 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం రూపుదిద్దుకోనుంది. ఈ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక 182 మీటర్ల ఎత్తైన ఐక్యతా విగ్రహం ప్రపంచంలో రెండో ఎత్తైన విగ్రహం కానుంది.  మరో మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తికానుంది. ఇప్పటికే నమూనాను యూపీ ముఖ్యమంత్రి ఖరారు చేశారు.

​​​​​​​సరయూ నదీ తీరాన.. ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం!

By

Published : Nov 15, 2019, 5:41 AM IST

​​​​​​​సరయూ నదీ తీరాన.. ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం!

గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ వల్లభ్​​భాయ్ పటేల్ స్టాట్యూ .. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సాధించింది. ఈ విగ్రహాన్ని నిర్మించి ఘన ఖ్యాతిని సంపాదించుకున్నారు హస్త కళాకారులు రామ్ సుతార్, అతని కుమారుడు అనిల్ రామ్ సుతార్. ఇప్పుడు, ఉత్తర్​ప్రదేశ్​లోని సరయూ నదీ తీరాన 251 మీటర్ల (సుమారు 885 అడుగుల) ఎత్తైన శ్రీరాముని విగ్రహం తయారు చేసి, సొంత రికార్డును బద్దలుకొట్టనున్నారు.

నమూనా ఖరారు...

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం పచ్చ జెండా ఊపగానే... అయోధ్య నగరమంతా శ్రీరామమయం చేసే పనిలో పడింది యూపీ సర్కారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తైన రామ విగ్రహాన్ని తయారు చేసేందుకు పూనుకుంది.

ఈటీవీ భారత్​ రిపోర్ట్​ ప్రకారం నోయిడాలోని సెక్టార్-63లో ఈ రాముడి విగ్రహం ఆకారం కోసం అనేక నమూనాలు తయారు చేశారు. ఈ స్వేత రామ నమూనాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖరారు చేశారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా గర్వంగా రాముడు నిల్చున్నట్లు నమూనాను రూపొందించిన్నట్లు హస్తకళాకారుడు రామ్ సుతార్ తెలిపారు.

"అయోధ్యలోని రాముడి విగ్రహం 251 మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అవుతుంది. నేల నుంచి 51 మీటర్ల దాకా ఆలయం, మ్యూజియం ఉంటుంది. దానిపై 550 అడుగుల రాముడి విగ్రహం ఉంటుంది. పైన గొడుగు 6 మీటర్లు అంటే 20 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం వేల సంవత్సరాల వరకు తుప్పు పట్టని నాణ్యమైన కాంస్యంతో తయారు చేస్తున్నాం. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు మూడున్నర సంవత్సరాల సమయం పడుతుంది."
-అనిల్​ సుతార్​, ప్రముఖ శిల్పి

రెండు రికార్డులు మనవే..

గుజరాత్‌లో రామ్​ సుతార్​ నిర్మించిన సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ విగ్రహం ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం. ఇది 182 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి ముందు, ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం చైనాలో 153 మీటర్ల ఎత్తున్న బుద్ధుడి విగ్రహం. ఇక, అయోధ్యలో 251 మీటర్ల రాముడి విగ్రహం పూర్తయితే ఇక ప్రపంచ ఎత్తైన విగ్రహాల్లో మొదటిది, రెండోది భారత్​లోనే ఉండనున్నాయి.

ఇదీ చదవండి:అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

ABOUT THE AUTHOR

...view details