తెలంగాణ

telangana

నవంబర్​ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్​

By

Published : Nov 15, 2019, 7:02 AM IST

ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం తుది నిర్ణయం తీసుకునేవరకు మహిళలను శబరిమలలోనికి అనుమతించాలని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీ దేశాయ్ అన్నారు. 2018 సుప్రీం తీర్పు ప్రకారం మహిళలు నిస్సందేహంగా ఆలయంలోకి ప్రవేశించవచ్చని వ్యాఖ్యానించారు. తాను నవంబర్​ 16న పూజల కోసం శబరిమల అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు.

నవంబర్​ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్​

నవంబర్​ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్​

ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీ దేశాయ్ అన్నారు. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీం నిర్ణయించిన అనంతరం... ఈ అంశంపై స్పందించారు తృప్తీ​.

శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉందని.. దీనికి వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదని అన్నారు తృప్తి. నవంబర్​ 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తానని తెలిపారామె.

"2018లో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం.. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై స్టే ఇవ్వలేదు. అందుకే ఈసారి ఉత్సవాలు ప్రారంభం కాగానే, ఏ మహిళ అయినా మందిరంలోకి ప్రవేశించవచ్చు. అక్కడి వారు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. 2018లో సుప్రీం తీర్పు వారి ప్రవేశంపై విధించిన నిషేధం ఎత్తివేసింది. అక్కడికి వెళ్లిన మహిళలకు రక్షణ కల్పించి ఆలయం లోపలిదాకా పంపించాలి."

-తృప్తీ దేశాయ్, మహిళా హక్కుల ఉద్యమకారిణి.

అత్యున్నత ధర్మాసనం తీర్పును గౌరవిస్తామని... సుప్రీం అతి తొందరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సారి తీర్పు మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కును తిరిగిస్తుందని తాము నమ్ముతున్నామని తృప్తీ తెలిపారు.

గతేడాది నవంబర్‌లో అయ్యప్ప ఆలయంలోకి కొందరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శబరిమలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ సమయంలోనే తృప్తి దేశాయ్‌ కూడా శబరిమల వెళ్లేందుకు విఫలయత్నం చేశారు.

ఇదీ చూడండి:అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

ABOUT THE AUTHOR

...view details