తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 7:32 AM IST

Updated : Feb 18, 2020, 5:00 AM IST

ETV Bharat / bharat

సొంత డబ్బుతో 'ప్లాస్టిక్'​పై పోరాడుతున్న ప్రజాప్రతినిధి

ప్రజలు ప్లాస్టిక్​ను విడనాడేందుకు ఓ ప్రజాప్రతినిధి నడుం బిగించారు. కర్ణాటక రాయచూర్​ జిల్లా సింధనూరు పురపాలక సంఘం సభ్యురాలు.. తన వార్డులో వస్త్రాలతో చేసిన సంచులను ఉచితంగా పంచుతున్నారు. ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

plastic
plastic

సొంత డబ్బుతో 'ప్లాస్టిక్'​పై పోరాడుతున్న ప్రజాప్రతినిధి

ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటక రాయచూర్​ జిల్లాలో ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు.

సింధనూరు పురపాలక సంఘంలో కౌన్సిలర్​ నళిని చంద్రశేఖర్​... పట్టణంలోని ప్రజలకు వస్త్రాలతో తయారు చేసిన సంచులను పంచుతున్నారు. ఆమె సొంత డబ్బులు ఖర్చుపెట్టి వస్త్రాలతో చేసిన 600 సంచులను హోసపేట నుంచి తెప్పించారు. వీటిని నళిని సొంత వార్డులో ఉచితంగా పంచిపెట్టారు.

"ప్లాస్టిక్​ను నిషేధించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నళిని. ఈ విషయం సంతోషాన్నిచ్చింది. ప్లాస్టిక్​ కర్మాగారాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది. నళిని వల్లనే సింధనూరులో...ప్రధాని మోదీ ప్రతిపాదించిన స్వచ్ఛభారత్​ను మొదటిసారి ప్రారంభించగలిగాం. ఆమెకు నా అభినందనలు."

- స్థానికుడు, సింధనూరు

తన వార్డును ప్లాస్టిక్​ రహితంగా మార్చాలని నిర్ణయించుకున్నారు నళిని. ఇందుకోసం ఆమె పంచిన సంచులపై 'స్వచ్ఛత వైపు నడుస్తాం' అనే సందేశాన్ని ముద్రించారు.

లాభాలు...

ఈ సంచులతో చాలా లాభాలున్నాయి. చాలా ఏళ్లు మన్నికనిస్తాయి. ఇందులో 10 నుంచి 15 కిలోల బరువును మోసుకెళ్లవచ్చు. వస్త్రంతో చేసిన సంచులు పర్యావరణ హితమైనవి. నూలు వస్త్రాలతో చేయటం వల్ల వీటిని రీసైకిల్​ కూడా చేయవచ్చు.

పర్యావరణానికి ప్లాస్టిక్​ చేసే హానిపైనా ప్రజలకు నళిని అవగాహన కల్పిస్తుండటం విశేషం. ఆమె ప్రయత్నాన్ని పలువురూ మెచ్చుకుంటున్నారు.

Last Updated : Feb 18, 2020, 5:00 AM IST

ABOUT THE AUTHOR

...view details