అంపన్ తుపాన్తో ఒడిశా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది. కేంద్రపార జిల్లాలో పురుటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తోన్న సమయంలో అగ్నిమాపక వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తల్లీబిడ్డలను జిల్లాలోని మహకల్పడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు అధికారులు. క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.