తెలంగాణ

telangana

By

Published : Aug 17, 2020, 5:45 PM IST

ETV Bharat / bharat

కరోనా కష్టాలు: వర్షంలో సైకిల్​పై అంతిమయాత్ర!

కొన్ని నెలలుగా అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది కరోనా. వైరస్​ సోకిందంటే చాలు.. బాధితుడికి ఆమడదూరం ఉంటున్నారు జనాలు. సాధారణంగా మృతి చెందినా కొవిడ్​ మరణం కిందే లెక్కగడుతున్నారు. కర్ణాటకలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోగా.. కనీస సాయమందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వర్షంలో సైకిల్​పైనే అంతిమయాత్ర చేపట్టారు ఆ కుటుంబసభ్యులు.

With no aid coming due to COVID fear, family transports body on bicycle
కరోనా భయం.. వర్షంలోనూ సైకిల్​పైనే అంతిమయాత్ర!

కరోనా భయంతో సాయమందించే వారే కరవై.. అయినవారికి సరైన అంతిమయాత్ర కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు కొంతమంది. ఇటీవల కర్ణాటకలో ఓ వృద్ధుడు మరణించగా.. కొవిడ్​ వల్లే మృతిచెందాడని అనుమానించి ఏ ఒక్కరూ సాయం చేయడానికి రాలేదు. ఇక చేసేదేమీ లేక వర్షంలో సైకిల్​పైనే మృతదేహాన్ని తరలించారు బాధిత కుటుంబ సభ్యులు.

ఇదీ జరిగింది..

బెళగావిలోని కిట్టూర్​లో ఓ 70 ఏళ్ల వ్యక్తి అనారోగ్యం బారినపడ్డాడు. కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ వైద్యుడికి చూపించగా.. కొవిడ్​ లక్షణాలు కనిపిస్తున్నాయి, ఆస్పత్రిలో చేర్పించమని సూచించారు. ఇంతలోనే అతడు మరణించాడు. ఎడతెరపిలేని వర్షాల కారణంగా మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టడం ఆ కుటుంబానికి కష్టమైంది. అంబులెన్స్​ సాయం కోసం అత్యవసర నంబర్​కు డయల్​ చేయగా ఎలాంటి స్పందనా లేదు. కరోనా భయంతో స్థానికులెవరూ ముందుకురాలేదు. ఇక చేసేదేమీలేక సైకిల్​పైనే మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించారు.

'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే'

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్​ కాగా.. రాష్ట్ర పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ స్పందించారు. ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప ప్రభుత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అంబులెన్స్​ సౌకర్యం ఎందుకు అందలేదని నిలదీశారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

ఇదీ చదవండి:ఆరేళ్ల టీచర్ ఆన్​లైన్​ పాఠాలు సూపర్

ABOUT THE AUTHOR

...view details