తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అభిమాన నేతకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

కాంగ్రెస్​ సీనియర్​ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. దిల్లీలోని నిగమ్​బోధ్​ ఘాట్​ వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

By

Published : Jul 21, 2019, 5:45 PM IST

Updated : Jul 21, 2019, 8:31 PM IST

అభిమాన నేతకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

అభిమాన నేతకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, అభిమానులు. దిల్లీలోని నిగమ్​బోధ్​ ఘాట్​ వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. భారీ వర్షం, ఈదురు గాలులను లెక్కచేయకుండా.. అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు పలికేందుకు కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రముఖుల హాజరు

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​, ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియా, హోంమంత్రి సత్యేంద్ర జైన్​ హాజరై కడసారి వీడ్కోలు పలికారు. భావోద్వేగానికి గురైన సోనియా.. తనకు షీలా దీక్షిత్​ ఎంతో మద్దతిచ్చారని, ఆమె తనకు పెద్ద చెల్లెలు వంటిదని కన్నీటి పర్యంతమయ్యారు.

అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు షీలా దీక్షిత్​. తూర్పు నిజాముద్దీన్​లోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని అందుబాటులో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యకర్తల సందర్శన అనంతరం అంతిమ యాత్ర చేపట్టారు.

ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి

Last Updated : Jul 21, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details