తెలంగాణ

telangana

By

Published : May 29, 2019, 9:07 PM IST

Updated : May 29, 2019, 9:34 PM IST

ETV Bharat / bharat

'సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి ఉంటాం'

కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం అంతర్గత కలహాలతో కూలిపోతుందని జోస్యం చెప్పారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప. అంతవరకు తమ పార్టీ వేచి చూస్తుందని పేర్కొన్నారు.

'సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి ఉంటాం'

'సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి ఉంటాం'

కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్ సంకీర్ణ​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప. అంతర్గత కలహాలతోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. అప్పటి వరకూ భాజపా వేచి చూస్తుందని స్పష్టం చేశారు.

" ఎన్నికలకు వెళ్లాలని మాకు ఎలాంటి ఆలోచన లేదు. వారు (కాంగ్రెస్​-జేడీఎస్​) ఒకరినొకరు కలహించుకొనే ఇంటికి వెళతారు. మేము వేచి ఉంటాం. మాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం పడిపోతుందనే భావిస్తున్నారు. శాసనసభ రద్దు, ఇతర అంశాలపై ప్రస్తుతం మాట్లాడాల్సిన అవసరం లేదు. "

- యడ్యూరప్ప, కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడు

కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వం సమర్థంగా పని చేయాలి లేదా రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలని యడ్యూరప్ప పేర్కొన్నారు. దానికి బదులుగా గందరగోళం సృష్టించటం, దోపిడి చేసే పనిలో మునిగిపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.

లోక్​సభ ఎన్నికల్లో భాజపా పనితీరుపై ప్రశంసలు కురిపించారు యడ్యూరప్ప. అధికార కూటమి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే భాజపాకే లాభం చేకూరుతుందన్నారు.

లోక్​సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి ఘోరంగా విఫలమైంది. రెండు పార్టీలకు చెరో సీటు మాత్రమే వచ్చింది. కూటమి సభ్యుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. తమ ఎమ్మెల్యేలను భాజపా అక్రమంగా లాక్కుంటుందనే భయం పట్టుకుంది. లోక్​సభ ఎన్నికల్లో 28 సీట్లకు గాను భాజపా 25 స్థానాల్లో విజయం సాధించింది.

ఇదీ చూండండి:కాంగ్రెస్​ నేతల్లో అసమ్మతి.. కన్నడనాట ఉత్కంఠ

Last Updated : May 29, 2019, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details