ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న వేళ ప్రపంచమంతా భారత్వైపు చూస్తోంది. కారణం.. మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మన దగ్గర ఎక్కువగా లభించటమే. తమ దేశ ప్రజలను కరోనా నుంచి రక్షించుకోవటానికి ఈ ఔషధం కోసం భారత్ను అమెరికా, బ్రెజిల్ సహా 30 దేశాలు అభ్యర్థిస్తున్నాయి. అసలు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మన దగ్గర అధికంగా లభించేందుకు కారణాలేంటో చూద్దాం.
చెట్టు బెరడే ఆధారం
ప్రపంచంలోని ఎన్నో దేశాలను మృతుల దిబ్బగా మార్చేసిన స్పానిష్ ఇన్ఫ్లూయంజా(1918) తర్వాత మానవాళిపై 1928 సంవత్సరం నుంచి మలేరియా రూపంలో మరో మహమ్మారి దాడిచేసింది. దీనికి దక్షిణ అమెరికాలోని సించోనా అనే చెట్ల బెరడును మందుగా వాడేవారు. దాన్ని క్వినైన్ అని పిలిచేవారు.
మలేరియా 1930 సంవత్సరాంతానికి అనేక దేశాలకు వ్యాపించడం వల్ల మందును భారీ ఎత్తున తయారుచేశారు. దానికి క్లోరోక్విన్గా పేరు పెట్టారు. ఈ మందుతో కొన్ని ప్రతికూలతలు వస్తున్నట్లు గుర్తించారు. 1950లో మరింత మెరుగుపరిచి, హైడ్రాక్సీ క్లోరోక్విన్ను తయారుచేశారు. ఈ ఔషధాన్ని మలేరియా, కీళ్లనొప్పులు, ఆటో ఇమ్యూన్తో వచ్చే లూపస్ వంటి వాటికి వాడుతున్నారు.
అక్కడ మలేరియా తక్కువ
అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా చాలా తక్కువ. అందుకే వాటిలో 1980 నుంచే క్రమంగా మందు తయారీని ఆపేశారు. దీని ధర కూడా తక్కువగా ఉండటం వల్ల ఫార్మా కంపెనీలకు లాభాలూ రావు. ఈ కారణంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి.
ప్రపంచ ఉత్పత్తిలో 70% మన వద్దే
అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో మలేరియా కేసులు ఎక్కువ. గ్రామాలు అధికంగా ఉన్న దేశాల్లో మరీ ఎక్కువ. ఫలితం భారత్, చైనా దేశాల్లో ఈ మందు భారీగా తయారవుతోంది. ప్రపంచంలోని 70% హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరాలను మనదేశమే తీరుస్తోంది. దీని తయారీకి వాడే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ- ముడిసరకు)ను మాత్రం అత్యధికంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.
ఎంత ఉత్పత్తి చేస్తున్నారు