తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలా చెప్పి కరోనా యోధులను అవమానిస్తారా?'

కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచి ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం లేదన్న కేంద్రంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. ఈ విధంగా కరోనా యోధులను అవమానించడం ఎందుకని ప్రశ్నించారు.

By

Published : Sep 18, 2020, 2:10 PM IST

Why insult corona warriors: Rahul on govt's 'no data on deaths of healthcare worker' RS reply
'కరోనా యోధులను అవమానించడం ఎందుకు?'

కొవిడ్‌పై పోరాటంలో ముందు వరుసలో నిలిచి మరణించిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం తమ దగ్గరలేదంటూ కేంద్రం చెప్పడం దారుణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరికాదని.. అది కొవిడ్ యోధులను అవమానించడమే అవుతుందని ధ్వజమెత్తారు.

కరోనా కారణంగా మరణించిన.. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల వివరాలు తెలపాలంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినిచౌబే. ఆ వివరాలు కేంద్రం దగ్గర ఉండవని, ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని సమాధానం ఇచ్చారు. ఆ వార్తను ట్యాగ్ చేస్తూ.. 'సమాచారం లేని మోదీ సర్కారు' అనే ట్యాగ్​తో అమెరికా నుంచి రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. దీపాలు వెలిగించడం, కంచాలను కొట్టి శబ్ధం చేయడం కంటే... కరోనా యోధుల రక్షణే చాలా ముఖ్యమని అన్నారు.

ఇదీ చూడండి:-'మోదీ హామీలు.. గాలిలో మేడలు కట్టడం ఒకటే'

ABOUT THE AUTHOR

...view details