తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు?'

సరిహద్దులో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి చైనాపై భారత్​ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ఈ మేరకు ప్రభుత్వం బాధ్యతలను గుర్తుచేస్తూ ట్వీట్​ చేశారు.

By

Published : Jul 7, 2020, 12:27 PM IST

Why didn't govt insist on restoration of status quo with China?: Rahul
'భారత ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు?'

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. సరిహద్దులో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి చైనాపై భారత ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు. జాతీయ అంశాలు చాలా ముఖ్యమని.. వాటిని రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని ట్వీట్​ చేశారు.

"జాతికి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యం. వాటిని రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. అలాంటప్పుడు.. చైనాతో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి భారత్​ ఎందుకు కృషి చేయలేదు? గల్వాన్​ ఘటనలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనా.. తన వైఖరిని సమర్థించుకునే అవకాశం భారత్​ ఎందుకు ఇచ్చింది? గల్వాన్​ లోయ సార్వభౌమాధికారాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఎందుకు?"

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంత కాలంగా భాజపా- కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా వైఖరిలో లోపాలున్నాయంటూ అనేకమార్లు ఆరోపణలు చేశారు రాహుల్​.

అయితే కాంగ్రెస్​ సీనియర్​ నేతపై భాజపా శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. రక్షణ విభాగానికి సంబంధించిన పార్లమెంట్​ స్థాయీ సంఘం సమావేశానికి రాహుల్​ ఒక్కసారి కూడా ఎందుకు హాజరు కాలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే ప్రశ్నించారు.

ఇదీ చూడండి:-డోభాల్​ చాకచక్యంతోనే చైనా వెనక్కు తగ్గిందా?

ABOUT THE AUTHOR

...view details