తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం ఆరోపణలు అవాస్తవం: బంగాల్​ సర్కార్​

కరోనా వైరస్​ పరిస్థితిని అంచనా వేయడానికి బంగాల్​కు పంపిన కేంద్ర బృందాలకు తాము సహకరించడం లేదనడం అవాస్తవమని ఆ రాష్ట్ర ​ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చింది.

By

Published : Apr 22, 2020, 11:41 AM IST

West Bengal
కేంద్రం ఆరోపణల్లో వాస్తవం లేదు

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు బంగాల్​ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు నియమించిన కేంద్ర బృందాలకు తాము సహకరిస్తున్నట్లు పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందాలకు మమతా బెనర్జీ సర్కార్​ అడ్డుపడిందని కేంద్రం ఆరోపించిన కొద్ది గంటలకే బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ ఇచ్చారు. కేంద్రం ఆరోపణల్లో నిజం లేదని ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.

"విపత్తు నిర్వహణ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం."

- రాజీవ సిన్హా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బంగాల్​

రాష్ట్రంలో సందర్శించే రెండు బృందాలకు బంగాల్ ప్రభుత్వం సహకరిస్తుందని సీఎస్​ హామీ ఇవ్వడాన్ని హోం మంత్రిత్వ శాఖ స్వాగతించింది.

ABOUT THE AUTHOR

...view details