తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కృత్రిమ మేధకు గ్లోబల్​ హబ్​గా భారత్​ అవతరించాలి'

రైజ్​-2020 వర్చువల్​ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కృత్రిమ మేధలో భారత దేశం ఓ గ్లోబల్​ హబ్​గా మారాలని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించారు. మనిషి నైపుణ్యానికి కృత్రిమ మేధను జోడిస్తే అద్భుతాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు.

By

Published : Oct 5, 2020, 8:54 PM IST

Updated : Oct 5, 2020, 10:42 PM IST

We want India to become a global hub for AI: PM Modi
'కృత్రిమ మేధకు గ్లోబల్​ హబ్​గా భారత్​ అవతరించాలి'

కృత్రిమ మేధ(ఏఐ)లో భారత దేశం ప్రపంచస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ఇందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో సాంకేతికతను ఉపయోగించుకుని విద్యను అభ్యసించడానికి పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నారు.

రైజ్​​-2020 వర్చువల్​ సదస్సులో పాల్గొన్న మోదీ.. సర్వీసులో పారదర్శకతను సాంకేతికత మెరుగుపరించిందని వ్యాఖ్యానించారు.

"కృత్రిమ మేధపై చర్చలు జరిపేందుకు రైజ్​-2020 ఓ గొప్ప వేదిక. సాంకేతికత, మనిషి అభ్యున్నతికి మధ్య ఎంతో బంధం ఉంది. కార్యాలయాలను సాంకేతికత పూర్తిగా మార్చేసింది. కనెక్టివిటిని పెంచింది. సామాజిక బాధ్యతలను పెంచింది. మనిషికి కృత్రిమ మేధ తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ఏఐలో భారత్​ గ్లోబల్​ హబ్​గా మారాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై ఇప్పటికే అనేకమంది భారతీయులు పనిచేస్తున్నారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ సందర్భంగా.. ఏప్రిల్​ నెలలో 'రెస్పాన్సిబుల్​ ఏఐ ఫర్​ యూత్​' కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు గుర్తుచేశారు మోదీ. 11వేలకుపైగా విద్యార్థులు.. పాఠశాల దశలోనే ఏఐపై బేసిక్​ కోర్సును పూర్తిచేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు వారు ఏఐ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు

Last Updated : Oct 5, 2020, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details