తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సేన' కొత్త ప్రతిపాదన.. 'మహా' సీఎం పీఠం చెరిసగం..! - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి జోరు కొనసాగుతోంది. అయితే... సాధారణ మెజార్టీ మాత్రమే దక్కే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెల్చుకున్న భాజపా ఈ సారి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. శివసేన మాత్రం అదే జోరులో ఉంది. ఈ నేపథ్యంలో సేన కొత్త ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమైంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని భాజపాను కోరనున్నట్లు తెలుస్తోంది.

'సేన' కొత్త ప్రతిపాదన.. 'మహా' సీఎం పీఠం చెరిసగం..!

By

Published : Oct 24, 2019, 12:28 PM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు​ రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా...ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను మించి కాంగ్రెస్​-ఎన్సీపీ గట్టి పోటీనిస్తున్నాయి. క్రితం సారి 122 స్థానాలు నెగ్గిన భాజపా ఈ సారి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అయితే.. సేన మాత్రం అదే జోరు కొనసాగిస్తోంది.

ఎప్పటినుంచో అధికారం పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోన్న శివసేన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని భాజపాను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనతో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను కలవనున్నారు.

సీఎం పీఠం చెరిసగం: సంజయ్​ రౌత్​

"ప్రస్తుత ఆధిక్యం తక్కువేమీ కాదు. భాజపాతో పొత్తును తప్పకుండా కొనసాగిస్తాం. సీఎం పదవికి 50-50 ప్రతిపాదన ఉంది. ఈ విషయం ఉద్ధవ్​ ఠాక్రేతో మాట్లాడేందుకు వెళుతున్నా."

-సంజయ్​ రౌత్​, రాజ్యసభ ఎంపీ

యువసేన అధినేత ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని భాజపాను అడగనున్నట్లు వెల్లడించారు రౌత్​. ప్రస్తుత ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆదిత్య.

ABOUT THE AUTHOR

...view details