తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కోటా మరణాలు': ప్రభుత్వ తీరుపై డిప్యూటీ సీఎం అసంతృప్తి - రాజస్థాన్​ కోటా ప్రభుత్వాస్పత్రిలో శిశువుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం సచిన్​పైలట్

రాజస్థాన్​ కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​. ఈ విషయంలో తమ ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు.

rj children
'కోటా మరణాలు' ప్రభుత్వంపై ఆత్మవిమర్శ-డిప్యూటీ సీఎం

By

Published : Jan 4, 2020, 8:42 PM IST

Updated : Jan 5, 2020, 8:38 AM IST

రాజస్థాన్​ కోటాలోని జేకే లాన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ ​పైలట్​ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందని స్పష్టం చేశారు.

"107మంది శిశువులు ఆస్పత్రిలో మరణించారు. ఇది చాలా బాధాకరం. గుండెను పిండేసే ఘటన. ఈ విషయం తెలిసి యావత్​ దేశం చలించిపోయింది. మా ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వస్తారు. అలాంటి వారు ఈ రోజు తమ బిడ్డలను కోల్పోతున్నారు. దీనికి మా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ఈ శిశు మరణాలకు మా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది."

-సచిన్​పైలట్​, రాజస్థాన్​ డిప్యూటీ సీఎం.

తొలుత బాధిత కుటుంటాలను పరామర్శించి అనంతరం ఆస్పత్రిని సందర్శించారు పైలట్​. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ శిశు మరణాల పట్ల తీవ్ర కలత చెందినట్లు చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి : 107కు చేరిన 'కోటా' మరణాలు.. కేంద్ర బృందం నివేదిక

Last Updated : Jan 5, 2020, 8:38 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details