రాజస్థాన్ కోటాలోని జేకే లాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందని స్పష్టం చేశారు.
"107మంది శిశువులు ఆస్పత్రిలో మరణించారు. ఇది చాలా బాధాకరం. గుండెను పిండేసే ఘటన. ఈ విషయం తెలిసి యావత్ దేశం చలించిపోయింది. మా ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వస్తారు. అలాంటి వారు ఈ రోజు తమ బిడ్డలను కోల్పోతున్నారు. దీనికి మా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ఈ శిశు మరణాలకు మా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది."