తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2019, 8:30 AM IST

Updated : Nov 15, 2019, 12:56 PM IST

ETV Bharat / bharat

ఆలోచన సూపర్​ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'

విద్యార్థులకు తాగడానికి నీటి సీసాలను పాఠశాలకు పంపించినా సరిగ్గా తాగరు. కారణమడిగితే ఖాళీ దొరకలేదంటూ సమాధానం చెబుతుంటారు. విద్యార్థులు తప్పనిసరిగా నీరు తాగేలా కేరళలోని యపరంబులో  ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి 'నీటి బెల్లు' కొడుతున్నారు.

బడిలో మోగింది 'నీటిగంట'

ఆలోచన సూపర్​ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'

నీరు తాగకపోతే పిల్లల్లో డీ హెడ్రేషన్ ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు తాగడానికి నీటి సీసాలను పాఠశాలకు పంపించినా సరిగ్గా తాగరు. కారణమడిగితే ఖాళీ దొరకలేదంటూ సమాధానం చెబుతుంటారు. ఈ సమస్యకు కేరళ రాష్ట్రం చెరువత్తూరు, వలియరంబు గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో పరిష్కారం కనుగొన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నీటి బెల్లు కొడుతున్నారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తుంటారు.

ఈ కార్యక్రమం ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ స్ఫూర్తిని వివిధ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు అందిపుచ్చుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో

విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కేరళ స్ఫూర్తితో ఆంధ్రపదేశ్​ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉమ్మర్ అరబిక్ పాఠశాలలో 'వాటర్​ బెల్' కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హాజరయ్యారు.

తమిళనాడులో

పాఠశాలల్లో విద్యార్థులు నీరు తాగేందుకు ప్రతి మూడు తరగతుల(పీరియడ్​) మధ్య పది నిమిషాల సమయం కేటాయించనున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్​ ప్రకటించారు. తరచూ నీరు తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కర్ణాటకలో పరిశీలన..

పాఠాశాలల్లో నీటిబెల్లు అంశంపై అధ్యయనం చేయాలని కర్ణాటక అధికారులను విద్యామంత్రి సురేశ్ కుమార్​ ఆదేశించారు.

ఇదీ చూడండి: విద్యను ఉపాధితో అనుసంధానం చేయాల్సిందే

Last Updated : Nov 15, 2019, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details