తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు వేదికగా మూడుముళ్లు.. వంతెనపై ఏడడుగులు! - marriage at tamilnadu kerala border

కరోనా మహమ్మారి..​ మనుషుల మధ్య భౌతిక దూరాన్ని పెంచగలిగింది కానీ.. పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకునే మనసులను మాత్రం దూరం చేయలేకపోయింది. అందుకే, లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రాలు దాటి పెళ్లి చేసుకోలేని ఓ జంట.. చెక్​పోస్ట్​నే కల్యాణ వేదికగా మార్చేసింది. కేరళ-తమిళనాడు సరిహద్దు వంతెనపై ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

WATCH: Inter-state couple ties knot at Chinnar bridge in Kerala
సరిహద్దు వేదికగా మూడుముళ్లు.. వంతెన సాక్షిగా ఏడు అడుగులు!

By

Published : Jun 9, 2020, 11:10 AM IST

తమిళనాడుకు చెందిన వరుడు.. కేరళకు చెందిన వధువు చిన్నార్​ బ్రిడ్జ్​ చెక్​పోస్ట్​ సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లికి కుటుంబ సభ్యులంతా.. హాజరవ్వాలనే కారణంతో ఇలా రోడ్డుపైనే కల్యాణం కానిచ్చారు.

సరిహద్దులో మూడుముళ్లు.. వంతెనపై ఏడు అడుగులు!

ఒకప్పుడు పెళ్ళి కుదిరింది మొదలు అమ్మాయి కాపురానికి వచ్చేంత వరకు చుట్టాలు చుట్టుముట్టి ఉండేవాళ్లు. మరి ఇప్పుడు.. కరోనా వైరస్​ వల్ల పెళ్లిళ్ల తీరే మారిపోయింది. అందుకే, ఈ చెక్​పోస్ట్​ పెళ్లిలోనూ అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, మాస్కులు, శానిటైజర్ల మధ్య వివాహం ప్రశాంతంగా జరిపించేశారు.

సరిహద్దు వేదికగా మూడుముళ్లు

పెళ్లికి హాజరైన బంధువులు భౌతిక దూరం పాటించేలా దగ్గరుండి పర్యవేక్షించారు పోలీసులు. ఓ పోలీసు అధికారి వారి చేతులను ఎప్పటికప్పుడూ శానిటైజ్​ చేస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వంతెన సాక్షిగా ఏడు అడుగులు
సరిహద్దు వేదికగా మూడుముళ్లు

ఇదీ చదవండి:కరోనా ట్రెండ్: ఇక మైక్రో వెడ్డింగ్​లదే హవా!

ABOUT THE AUTHOR

...view details