తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్​ కొట్టివేత

50 శాతం వీవీప్యాట్​ రసీదులు లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసింది. లెక్కింపుపై ఏప్రిల్​ 8న ఇచ్చిన తీర్పును మార్చబోమని స్పష్టం చేసింది. 50 శాతం కుదరకపోతే కనీసం 25 శాతం రసీదులు లెక్కించాలని అభ్యర్థించినప్పటికీ కోర్టు అంగీకరించలేదని విపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ మను​ సింఘ్వీ తెలిపారు.

By

Published : May 7, 2019, 11:16 AM IST

Updated : May 7, 2019, 2:43 PM IST

సుప్రీం

ఈవీఎంలపై పిటిషన్​ కొట్టివేత

50శాతం వీవీప్యాట్​ ఈవీఎంల రసీదులు లెక్కించాలన్న విపక్షాల పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్​లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్​ 8న ఇచ్చిన తీర్పును మార్చబోమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు వేసిన సమీక్షా వ్యాజ్యంపై ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.

విపక్షాలు వెనక్కి తగ్గినా...

50శాతం వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించడంపై విపక్షాలు కాస్త వెనక్కు తగ్గాయి. 21 పార్టీల తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ.. కనీసం 25 శాతం రసీదులైనా లెక్కించాలని సుప్రీంను కోరారు. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

"మా మొదటి పిటిషన్​కు స్పందిస్తూ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్ల రసీదులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరం. మా వాదనలకు అంగీకరించి ఈ తీర్పు ఇవ్వడం అంటే మేము విజయ సాధించినట్టే. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లు అంటే అది 2 శాతమే. మేము అడిగేది ఒక్కటే.. తొలుత 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని కోరాం. ఈ ఎన్నికల్లో కనీసం 33శాతం చేయాలని అభ్యర్థించాం. అదీ కుదరకపోతే కనీసం 25శాతం చేయాలని అడిగాం. కానీ మా వినతిని అంగీకరించకపోవడం దురదృష్టకరం."
--- అభిషేక్​ సింఘ్వీ, విపక్షాల తరఫు న్యాయవాది.

ఇదీ నేపథ్యం...

గతంలో ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో వీవీప్యాట్​ ఈవీఎం రసీదులు లెక్కించేవారు. అయితే... ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ 21 విపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికల్లో లెక్కించాల్సిన వీవీప్యాట్​ రసీదుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్​ రసీదులను లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు.

ఈసీ అభ్యంతరం...

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కో వీవీప్యాట్​లోని రసీదులను లెక్కిస్తున్నామని, ఇదే సరైన పద్ధతి అని కోర్టుకు తెలిపింది ఈసీ. ప్రతిపక్షాలు కోరిన పద్దతి అనుసరించటం సాధ్యపడదని స్పష్టం చేసింది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను పిటిషనర్లు చూపలేకపోయారని వివరించింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు... నియోజకవర్గానికి 5 వీవీప్యాట్​లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్​ 8న ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు మళ్లీ సుప్రీంను సంప్రదించాయి. రివ్యూ పిటిషన్​ దాఖలు చేశాయి.విపక్షాల రివ్యూ పిటిషన్​పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. 50శాతం వీవీప్యాట్​ రసీదులు లెక్కించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

Last Updated : May 7, 2019, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details