తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11 గంటల వరకు పోలింగ్​ శాతాలిలా...

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పోలింగ్​ సరళిని పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమ్​బంగలో, అత్యల్పంగా జమ్ముకశ్మీర్​లో ఓటింగ్​ జరిగింది.

By

Published : May 6, 2019, 12:01 PM IST

Updated : May 6, 2019, 12:41 PM IST

11 గంటల వరకు పోలింగ్​ శాతాలిలాా...

కొన్ని చోట్ల మినహా ఐదో దశ పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. పుల్వామాలో గ్రనేడ్​ దాడి, బిహార్​లో ఈవీఎం ధ్వంసం, బంగాల్​లో తృణమూల్​, భాజపా కార్యకర్తల ఘర్షణ వంటి చిన్న చిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

11 గంటల వరకు ఓటింగ్​ శాతం

11 గంటల వరకు పోలింగ్​ శాతాలను ప్రకటించింది ఎన్నికల సంఘం. ఓటింగ్​ శాతంలో బంగాల్​ దూసుకెళ్తోంది. మొదటిస్థానంలో ఉంది. అత్యల్ప ఓటింగ్​ నమోదుతో జమ్ముకశ్మీర్​ చివర్లో నిలిచింది.

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ్​ బంగ 33.16
ఝార్ఖండ్​ 29.49
రాజస్థాన్​ 29.32
మధ్యప్రదేశ్​ 25.68
ఉత్తర్​ప్రదేశ్​ 22.46
బిహార్​ 20.74
జమ్ముకశ్మీర్​ 6.09

పుల్వామాలోని స్థానిక పోలింగ్​ కేంద్రంపై ముష్కరుల గ్రనేడ్​ దాడితో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పటిష్ఠ చర్యలు చేపట్టింది.

బంగాల్​లో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. బిహార్​ ఛప్రాలోని పోలింగ్​ కేంద్రంలో ఓ వ్యక్తి ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేశాడు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఓటర్లకు వినూత్నంగా స్వాగతం...

రాజస్థాన్​ హనుమాన్​గఢ్​లోని ఓ మోడల్​ పోలింగ్​ బూత్​లో మహిళా ఓటర్లకు వినూత్న స్వాగతం పలుకుతున్నారు సిబ్బంది. నుదుట బొట్టు.. మెడలో పూల దండలు వేసి ఓటు వేయడానికి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

Last Updated : May 6, 2019, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details