తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2019, 5:29 AM IST

Updated : Sep 26, 2019, 8:05 PM IST

ETV Bharat / bharat

'కశ్మీర్ ప్రజల గొంతుకను తప్పక వినాలి'

దేశంలోని అధిక శాతం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేసిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రబలంగా ఉండాలంటే జమ్ముకశ్మీర్‌ ప్రజల గొంతులను తప్పక వినాలన్నారు.

'కశ్మీర్ ప్రజల గొంతుకను తప్పక వినాలి'

ఆర్టికల్​ 370 రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ తొలిసారి గళం విప్పారు. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దుతో దేశం తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు​. దేశంలోని మెజారిటీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రబలంగా ఉండాలంటే.. జమ్ముకశ్మీర్‌ ప్రజల గొంతుకను తప్పక వినాల్సిన అవసరముందని మోదీ సర్కారుకు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు మన్మోహన్​.

నేడు రాజ్యసభకు నామినేషన్​

రాజ్యసభ ఉపఎన్నికల్లో రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ స్పష్టం చేశారు. భాజపా రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి మన్మోహన్ పోటీచేయనున్నారు.

అసోం నుంచి రాజ్యసభకు దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ పదవీకాలం జూన్ 14నే ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను రాజస్థాన్​ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది కాంగ్రెస్.

గెలుపు లాంఛనమే!

రాజస్థాన్​లో మొత్తం 200 శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ 100, భాజపా 72 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​ మెజారిటీలో ఉన్నందున.. మన్మోహన్​ గెలుపు లాంఛనమే కానుంది.

Last Updated : Sep 26, 2019, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details