తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2020, 4:29 PM IST

ETV Bharat / bharat

ఆ నియమం పాటిస్తేనే షిరిడీ సాయి దర్శనం!

షిరిడీ సాయిబాబాను దర్శించుకోవాలంటే తాము తీసుకొచ్చిన కొత్త నిబంధనను పాటించాల్సిందేనని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. సాయిబాబా మందిరంలోకి భక్తులు ప్రవేశించాలంటే భారతీయ వస్త్రధారణలోనే రావాలని స్పష్టంచేశారు.

Visitors asked to wear cultured outfits while entering Shirdi Sai Baba temple Temple
ఆ నియమం పాటిస్తేనే షిరిడీ సాయిబాబా దర్శనం!

షిరిడీ సాయిబాబా దర్శనం కోసం వెళ్లేవారు భారతీయ సంప్రదాయాలు, నాగరితకు తగిన విధంగా ఉన్న వస్త్రధారణలోనే రావాలని ఆలయ ట్రస్టు సూచించింది. ఆలయ ఆవరణలో పొట్టి దుస్తుల్లో తిరగడాన్ని నిషేధించింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.

లాక్​డౌన్​ తర్వాత సాయిబాబా దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తున్నారు. అయితే కొంతమంది భక్తలు టీ-షర్టులు, జీన్స్​ వేసుకొని వస్తున్నట్లు గుర్తించింది ట్రస్టు. దీంతో భారతీయ వేషధారణలోనే రావాలనే నియమాన్ని పెట్టింది. కొందరు భక్తుల సూచనలు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'రైతుల ఆదాయం కిందకు​- మోదీ దోస్తుల ఆస్తి పైపైకి'

ABOUT THE AUTHOR

...view details