తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' ఆగ్రహం: యూపీలో మిన్నంటిన నిరసనలు - అంతర్జాల సేవల రద్దు...

ఉత్తరప్రదేశ్​ వ్యాప్తంగా పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. కాన్పుర్​లో పౌరచట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాయుతంగా మారింది. యతీంఖానా పోలీస్​ స్టేషన్​కు నిప్పంటించారు ఆందోళనకారులు. లఖ్​​నవూలో పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెంచే వార్తలను అరికట్టేందుకు ఈ నెల 23 వరకు అంతర్జాల సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

Violence in Kanpur, police post torched
'పౌర' ఆగ్రహం: యూపీలో మిన్నంటిన నిరసనలు

By

Published : Dec 21, 2019, 8:31 PM IST

Updated : Dec 21, 2019, 11:38 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్​ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కాన్పుర్​లో వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. యతీంఖానా పోలీసు స్టేషన్ లక్ష్యంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీస్​ స్టేషన్​కు నిప్పంటించారు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు ప్రయోగం చేశారు పోలీసులు. లాఠీఛార్జీ చేశారు.

ఇద్దరు రాజకీయ నేతల అరెస్టు...

ముందస్తు జాగ్రత్తగా సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్​ బాజ్​పేయీ, మాజీ శాసనసభ్యుడు కమలేశ్​ తివారీలను అరెస్టు చేశారు అధికారులు. నేతల వాహనాలను సీజ్​ చేశారు.

బాబుపూర్వా, నాయి సడక్, మూల్‌గంజ్, దలేల్‌పూర్వా, హలీమ్ కళాశాల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అంతర్జాల సేవల రద్దు...

లఖ్​నవూలో పౌర చట్టానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను రెచ్చగొట్టే సమాచారం వ్యాప్తి చెందకుండా డిసెంబర్ 23 వరకు అంతర్జాల సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

15 మంది మృతి..

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 8 ఏళ్ల చిన్నారి ఉన్నట్లు తెలిపారు.

'పౌర' ఆగ్రహం: యూపీలో మిన్నంటిన నిరసనలు

ఇదీ చూడండి:రేపు రాజ్​ఘాట్​ వేదికగా సోనియా, రాహుల్ 'పౌర' ధర్నా

Last Updated : Dec 21, 2019, 11:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details