గ్యాంగ్స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన స్థితి నివేదికను సమర్పించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానానికి ఈ రిపోర్టును శుక్రవారం అందించనున్నట్టు ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.
దుబే, అతడి అనుచరుల ఎన్కౌంటర్తో పాటు 8మంది పోలీసుల మృతిపై విచారించేందుకు మాజీ న్యాయమూర్తి నేతృతంలో ఓ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇదే విషయంపై దాఖలైన వ్యాజ్యాలను ఈ నెల 20న విచారించనున్నట్టు తెలిపింది.