భారత్కు వియత్నాం అత్యంత కీలక భాగస్వామి అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్తో వర్చువల్గా భేటీ అయ్యారు మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగైనట్లు చెప్పారు.
భారత సులభ విధానంలో వియత్నాం మూల స్తంభమని మోదీ అన్నారు. ఆ దేశంతో సుదీర్ఘ, వ్యూహాత్మక బంధాలు కొనసాగించాలని భారత్ భావిస్తోందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటమే రెండు దేశాల ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. వియత్నాం ప్రభుత్వం కరోనాను కట్టడి చేసిన తీరును కొనియాడారు.