రాజ్యసభ టీవీ యూట్యూబ్లో 40 లక్షలకు పైగా సబ్స్క్రిప్షన్స్ సాధించిన సందర్భంగా ఛానెల్ సిబ్బందిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. 2017 ఆగస్ట్లో 4.5 లక్షలుగా ఉన్న ఛానెల్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య.. రెండున్నరేళ్లలోనే విశేష ప్రజాదరణ పొందిందని వరుస ట్వీట్లలో ప్రశంసించారు. వీక్షకులకు సమాచార విద్యా వేదికగా ఆర్ఎస్ టీవీ మారిందని కొనియాడారు. 2011లో ప్రారంభమైన రాజ్యసభ టీవీ.... రాజ్యసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంతో పాటు.. పార్లమెంటరీ వ్యవహారాలు, వర్తమాన వ్యవహారాల గురించి విశ్లేషణ చేస్తోంది.
రాజ్యసభ టీవీకి 40 లక్షల సబ్స్క్రిప్షన్లు.. వెంకయ్య ప్రశంసలు - రాజ్యసభ టీవీ యూటూబ్లో 40లక్షలకు పైగా సబ్స్ర్కిప్షన్స్ సాధించింది
రాజ్యసభ టీవీ యూట్యూబ్ ఛానెల్ 40 లక్షలకు పైగా సబ్స్క్రిప్షన్లు సాధించింది. ఈ సందర్భంగా ఛానెల్ సిబ్బందిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

రాజ్యసభ టీవీకి 40లక్షల సబ్స్క్రైబర్స్...ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
ఇదీ చూడండి : ఈ నెల 17న నింగిలోకి జీశాట్-30: శివన్