బాబ్రీ మసీదు కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
బాబ్రీ కేసులో మొత్తం 32మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎమ్ఎమ్ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు.