కరోనా కట్టడి నిబంధనలను పార్లమెంటు సభ్యులందరూ విధిగా పాటించాలని కోరారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సభ కొనసాగుతున్న సమయంలో సభ్యులు మరొకరి సీట్ల వద్దకు గానీ, టేబుల్ హౌస్ వద్దకు గానీ వెళ్లొద్దని సూచించారు.
"సభ కొనసాగుతున్నప్పుడు సభ్యులు ఎవరూ టేబుల్ ఆఫీస్ వద్దకు రాకూడదు. ఇతర సభ్యుల సీటు వద్దకు వెళ్లి చెవిలో మాట్లాడటం చేయకూడదు. ఏదైనా మాట్లాడేది ఉంటే చీటీలను పంపించండి. పరీక్షల్లో స్లిప్పులు పాస్ చేసుకోవడం నిషేధం కానీ.. ఇక్కడ(రాజ్యసభలో) వీటికి అనుమతి ఉంది."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్