తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందే భారత్​: జూన్​ 4 నుంచి అదనపు విమానాలు - Air India announces more flights to evacuate Indians

కరోనా లాక్​డౌన్​తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్​ మిషన్​లో భాగంగా అదనపు విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది ఎయిర్​ ఇండియా. అమెరికా, బ్రిటన్​, జర్మనీ వంటి దేశాలకు జూన్​ 4- 6 మధ్య అదనపు విమానాలు నడుస్తాయని తెలిపింది.

Vande Bharat
వందే భారత్​: జూన్​ 4 నుంచి ఆ దేశాలకు అదనపు విమానాలు

By

Published : May 30, 2020, 11:27 AM IST

వందే భారత్​ మిషన్​లో భాగంగా జూన్​ 4 నుంచి 6వ తేదీ మధ్య అదనపు విమానాలు నడపనున్నట్లు ఎయిర్​ ఇండియా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్​, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్​, స్వీడన్​ దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఈ అదనపు విమానాలు నడుపుతున్నట్లు వెల్లడించారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

" వందే భారత్​ మిషన్​లో భాగంగా ఎయిర్​ ఇండియా అదనపు విమానాలను ప్రకటించింది. జూన్​ 4న దిల్లీ నుంచి ఆక్లాండ్​, జూన్​ 5న దిల్లీ నుంచి చికాగో, స్టాక్​హోం, జూన్​ 6న దిల్లీ నుంచి న్యూయార్క్​, ఫ్రాంక్​ఫర్ట్​, సియోల్​, ముంబయి నుంచి లండన్​, న్యూయార్క్​కు ఈ విమానాలు బయలుదేరనున్నాయి."

– హర్దీప్​ సింగ్​ పూరి, పౌర విమానయాన శాఖ మంత్రి.

ఈ విమానాల ముందస్తు బుకింగ్స్​ మే 30న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు కేంద్ర మంత్రి.

రెండు దశల్లో..

కరోనా లాక్​డౌన్​తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్​ మిషన్​ చేపట్టింది కేంద్రం. మొదటి దశలో భాగంగా మే 7- 16 మధ్య సుమారు 16 వేల మందిని తీసుకొచ్చింది. రెండో దశ మిషన్​ మే 17న ప్రారంభమైంది. జూన్​ 13 వరకు కొనసాగనుంది. ఈ మిషన్​లో భాగంగా 60 దేశాలకు విమానాలు నడుపుతోంది ఎయిర్​ ఇండియా.

ABOUT THE AUTHOR

...view details