తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పాట్లు" - సీడబ్ల్యూసీ సమావేశం

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం ​గుజరాత్​లోని అహ్మదాబాద్​లో నేడు సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. పలు తీర్మానాలను ఆమోదించారు కాంగ్రెస్​ అగ్రనేతలు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

"వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పాట్లు"

By

Published : Mar 12, 2019, 7:25 PM IST

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ భద్రతా అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. ​గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.

భేటీలో కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, ముఖ్య నేతలు ప్రియాంక గాంధీ, అహ్మద్​ పటేల్​, గులాం నబీ ఆజాద్​ సహా తదితర నాయకులు పాల్గొన్నారు.

భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీనియర్​ నేత ఆనంద్ శర్మ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను భాజపా నాశనం చేస్తోందని ఆరోపించారు.

పాక్​కు హెచ్చరిక...

సీడబ్ల్యూసీ పాకిస్థాన్​కు గట్టి హెచ్చరిక పంపింది. శత్రువుపై పోరాడేందుకు దేశం మొత్తం సమైక్యంగా ఉంటుందని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సైన్యాన్ని చూసి దేశం గర్విస్తోందని.... హింస, ఉగ్రవాదం వంటి చర్యలతో భారత్​ను ఏమీ చేయలేరని తీర్మానంలో పొందుపరిచింది.

అభద్రతా భావం పెరిగింది

"దేశంలో భయం, అభద్రతా భావం పెరిగిపోతోంది. మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, రచయితలు, వ్యాపారవేత్తల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. షెడ్యూల్డ్​ తరగతులు, షెడ్యూల్డ్​ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల వారి రాజ్యాంగ, చట్టపరమైన హక్కులపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది. అన్ని ప్రభుత్వ సంస్థల అణిచివేత కొనసాగుతోంది. " అని మరో తీర్మానాన్ని ఆమోదించింది సీడబ్ల్యూసీ.

ABOUT THE AUTHOR

...view details