తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శాస్త్ర రంగంలో పురోగతికి ఇది నిదర్శనం' - భారత్​లో వ్యాక్సిన్​ అత్యవసర అనుమతి పై వెంకయ్యనాయుడు

దేశంలో కరోనా వ్యాక్సిన్​ అత్యవసర అనుమతికి రెండు సంస్థలు అనుమతి పొందండంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశ శాస్త్రరంగ పురోగతికి ఇది నిదర్శనమని అన్నారు. వ్యాక్సిన్​ని ప్రజల వద్దకు చేర్చడానికి అంకితభావంతో పనిచేయాలని చెప్పారు.

vaccin approval is the symbol of progressive of science in india
శాస్త్ర రంగంలో పురోగతికి ఇది నిదర్శనం

By

Published : Jan 5, 2021, 7:31 AM IST

Updated : Jan 5, 2021, 7:40 AM IST

కరోనాకు వ్యాక్సిన్​ తీర్చిదిద్ది, వాటిని అత్యవసరంగా వాడేందుకు రెండు సంస్థలు అనుమతి పొందడం భారతదేశ శాస్త్ర పురోగతికి నిదర్శనమని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రెండు సంస్థల వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై సోమవారం ఆయన ఫేస్​బుక్​ ద్వారా స్పందించారు.

"అత్మనిర్భర్​ భారత్​లో భారతీయులకే కాకుండా ప్రపంచంలో అందరికీ లబ్ధి కలుగుతుందనడానికి ఇదొక నిదర్శన. కరోనాకు కళ్లెం వేయడానికి ఎలా పనిచేశామో అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రజల వద్దకు వ్యాక్సిన్​ను చేర్చాలి. ఈ విజయానికి కారకులైన అందరినీ అభినందించాలి" అని చెప్పారు.

ఇదీ చదవండి:టీకా​ కోసం ఈ వారమే భారత్​ బయోటెక్​తో ఒప్పందం

Last Updated : Jan 5, 2021, 7:40 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details