తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2019, 10:33 AM IST

Updated : Oct 2, 2019, 4:47 AM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఆంక్షలు వేగంగా ఎత్తివేయాలి: అమెరికా

కశ్మీర్​లో భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అమెరికా స్పందించినట్లు తెలిసింది. వీలైనంత తొందరగా ఆంక్షలు ఎత్తివేసి.. నిర్బంధంలోని రాజకీయ నాయకులను విడుదల చేయాలని అగ్రరాజ్యం కోరినట్లు అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి అలీస్‌వెల్స్‌ తెలిపారు.

కశ్మీర్​లో ఆంక్షలు వేగంగా తొలగించాలి : అమెరికా

కశ్మీర్​లో విధించిన ఆంక్షలు తొలగించేందుకు భారత్​ ముమ్మర చర్యలు చేపట్టాలని కోరింది అమెరికా. నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్​ రాజకీయ నేతలను విడుదల చేసే దిశగా మోదీ సర్కారు అడుగులేయాలని పేర్కొంది. ఇరుదేశాధినేతలతో ట్రంప్​ ప్రత్యేక భేటీ అనంతరం.. అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి అలీస్‌వెల్స్‌ ఈ ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే.. కశ్మీర్​లో ఎన్నికలు వీలైనంత తొందరగా జరపాలని కోరారు.

"జమ్ముకశ్మీర్​ ప్రజా జీవనంపై ఆంక్షలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులను భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్​లో ఆంక్షలు ఎత్తివేతతో పాటు నిర్బంధంలో ఉన్న నేతల విడుదలకు భారత్​ సత్వర చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం."
- అలీస్‌వెల్స్‌ , అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి

ట్రంప్​ సిద్ధంగా ఉన్నారు

కశ్మీర్​ తమ అంతర్గత వ్యవహారమని మొదట్నుంచి భారత్​ చెబుతూనే ఉంది. అయితే ఇరుదేశాలు కోరుకుంటే కశ్మీర్​ అంశంపై ట్రంప్​ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అలీస్.

ఆగస్టులో 370 రద్దు

గతనెలలో కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని మోదీ 2.0 ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం లోయలో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించి.. స్థానిక రాజకీయనేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు అధికారులు.

Last Updated : Oct 2, 2019, 4:47 AM IST

ABOUT THE AUTHOR

...view details