అమెరికా మసాచుసెట్స్లోని బాబ్సన్ కాలేజీకి చెందిన విద్యార్థిని ఉత్తర్ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. 19 ఏళ్ల సుదీక్షా భాటి బులంద్షహర్కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సెలవుల కోసం భారత్కు వచ్చిన సుదీక్ష ఆగస్టు 20న అమెరికా వెళ్లాల్సి ఉంది.
ఈవ్ టీజింగే కారణం..
బంధువులను కలవడానికి వెళుతుండగా కొంతమంది ఈవ్ టీజర్లు వెంబడించటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సుదీక్ష మామయ్య మనోజ్ వెల్లడించారు.
"రోడ్డుపై వెళుతుండగా కొంతమంది యువకులు సుదీక్ష పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను ఆకట్టుకోవడానికి తమ ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. హఠాత్తుగా వాళ్ల వాహనం సుదీక్ష స్కూటీని ఢీకొట్టింది. అదుపు తప్పిన సుదీక్ష కిందపడి అక్కడికక్కడే మరణించింది."
- మనోజ్ భాటి, సుదీక్ష బంధువు
అయితే... ఈ వ్యవహారంతో ఈవ్ టీజింగ్కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి స్పష్టంచేశారు. బాధితురాలి కుటుంబం నుంచి అలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. సుదీక్ష మృతదేహాన్ని శవపరీక్షకు తరలించామని, దర్యాప్తు కొనసాగుతోందని బులంద్షహర్ ఎస్పీ అతుల్ శ్రీవాస్తవ తెలిపారు.
దోషుల్ని శిక్షించాలి: మాయావతి