తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2019, 4:51 PM IST

ETV Bharat / bharat

శరద్ పవార్​తో ఊర్మిళ మతోంద్కర్ భేటీ

ఉత్తర ముంబయి​ లోక్​సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు సినీనటి ఊర్మిళ మతోంద్కర్. తాజాగా మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. శరద్ పవార్ సూచనలు తన గెలుపునకు దోహదం చేస్తాయని ఊర్మిళ ఆశాభావం వ్యక్తం చేశారు.

శరద్ పవార్​తో ఊర్మిళ మతోంద్కర్ భేటీ

లోక్​సభ ఎన్నికల వేళ సినీనటి, ఉత్తర ముంబయికాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మతోంద్కర్... ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో భేటీ అయ్యారు. అరగంటపాటు పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ముంబయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్​, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. ఐదు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎన్సీపీ పోటీ చేస్తున్నాయి.
ఊర్మిళ ఉత్తర ముంబయి లోక్​సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. భేటీ అనంతరం పవార్ సహకారం, మార్గనిర్దేశకత్వంలో కచ్చితంగా విజయం సాధిస్తానని ఊర్మిళ విశ్వాసం వ్యక్తం చేశారు.

"గురుతుల్యులు, మహోన్నత వ్యక్తి శరద్​పవార్​ మార్గదర్శకత్వంలో... నా ప్రయాణం విజయం దిశగా సాగుతోంది. నా పోరాటానికి అండగా ఉన్న పెద్దాయనకు ధన్యవాదాలు." -ఊర్మిళ మతోంద్కర్​ ట్వీట్​

ముంబయిలోని 6 లోక్​సభ నియోజకవర్గాలకు నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్​ 29న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తర ముంబయి​ లోక్​సభ స్థానం నుంచి ఊర్మిళ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఆమెపై భాజపా సిట్టింగ్​ ఎమ్మెల్యే గోపాల్​ శెట్టి పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గోపాల్ శెట్టి... తన కాంగ్రెస్ ప్రత్యర్థి సంజయ్​ నిరుపమ్​పై గెలుపొందారు.

ఇదీ చూడండి : ప్రతిపక్షాలకు ఓటమి భయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details