మే 31న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష వాయిదా వేసినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష వాయిదా - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరోసారి పొడిగించిన నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 31న జరగాల్సిన సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష 2020ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
"లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో పరీక్షలు, ముఖాముఖిలు నిర్వహించటం సాధ్యం కాదని కమిషన్ నిర్ణయించింది. అందువల్ల మే 31న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష-2020ని వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త తేదీలను 30 రోజుల ముందు అభ్యర్థులకు తెలియజేస్తాము."
-యూపీఎస్సీ ప్రకటన