తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాకీతో బెదిరించి అత్యాచారం- నిందితుడు అరెస్ట్​ - ఉత్తర్​ ప్రదేశ్​లో అత్యాచారం కేసు

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. మూడు రోజుల క్రితం అతడు బాధితురాలిని తుపాకీతో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.

UP woman raped, assaulted at gunpoint; accused held
తుపాకితో బెదిరించి అత్యాచారం- నిందితుడు అరెస్ట్​

By

Published : Jan 7, 2021, 3:27 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలో మూడు రోజుల క్రితం ఓ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల ప్రకారం..

ఒంటరిగా ఉన్న బాధితురాలి ఇంట్లోకి పొరుగున ఉన్న అరవింద్ ప్రవేశించి.. తుపాకీతో బెదిరించి ఘాతుకానికి ఒడిగట్టాడు. దీని గురించి ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను భయపెట్టాడు. అయితే, జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది బాధితురాలు.

దీంతో బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తప్పు ఒప్పుకున్నాడు.

ఇదీ చూడండి:'చిరుత' దాడికి రేడియం జాకెట్​తో చెక్!​

ABOUT THE AUTHOR

...view details