తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రక్కు-ట్రాక్టర్​ ఢీ.. ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు-ట్రాక్టర్​ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Jun 6, 2019, 1:04 PM IST

ట్రక్కు-ట్రాక్టర్​ ఢీ.. ఆరుగురు మృతి

వారంతా స్థానికంగా జరిగిన ఓ పండుగకు హాజరై సంతోషంగా ట్రాక్టర్​లో ఇంటికి తిరుగుపయనమయ్యారు. అనుకోని రూపంలో వారిలో కొందరిని మృత్యువు కబళించింది. ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయీలో ఈ ఘటన జరిగింది.

హర్దోయీలో ఘోర రోడ్డుప్రమాదం

కత్రా-బిల్హౌర్​ జాతీయ రహదారి వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు... ట్రాక్టర్​ను ఢీకొంది. ఘటనలో ఆరుగురు మరణించారు. అదే ట్రాక్టర్​లోని మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details