రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సాంకేతికతపై దృష్టి సారించింది. ఇజ్రాయెల్ రూపొందించిన 6th సెన్స్ అనే పరికరాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలపై విశ్లేషించిన అధికారులు.. వాటికి తగిన పరికరం కోసం అన్వేషించారు. రాత్రి వేళల్లో చోదకుడు నిద్రపోవటం, వాహనాలను ఓవర్టేక్ చేయటం, అతి వేగం వంటి తప్పిదాలను ముందుగానే గుర్తించే ఇజ్రాయెల్ పరికరానికి ఓటు వేశారు. ప్రస్తుతానికి లఖ్నవూలోని అవధ్ డిపోకు చెందిన ఏసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమర్చారు.
"ఈ పరికరంతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సాంకేతికత ఇజ్రాయెల్కు చెందినది. మేం దిగుమతి చేసుకున్నాం. ఈ పరికరానికి ఎస్ఆర్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. అనుమతులు రాగానే అన్ని బస్సుల్లో ప్రవేశపెడతాం. ప్రస్తుతం 4 బస్సుల్లోనే అమర్చాం. ఈ పరికరం ధర రూ. 40 నుంచి 50 వేల మధ్య ఉంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే రాయితీ లభించే అవకాశం ఉంటుంది."