ఉత్తర్ప్రదేశ్ ఫరూఖాబాద్ కసారియాలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 20 మంది చిన్నారులను నిర్బంధించిన ఓ హత్యకేసు నిందితుడు సుభాష్ బాథమ్ కాల్పుల్లో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేశారు.
రూ.10 లక్షల రివార్డ్
ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసిన యూపీ పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందిస్తూ, రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఆపరేషన్లో పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందించనున్నట్లు యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కె అవస్థీ తెలిపారు.