తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంధించిన దుండగుడు హతం.. చిన్నారులు సురక్షితం - సుభాశ్​ బాథమ్ హతం

ఉత్తర్​ప్రదేశ్ ఫరూఖాబాద్​లో 20 మంది చిన్నారులను నిర్బంధించిన... ఓ హత్య కేసు నిందితుడు సుభాశ్​ బాథమ్​ను పోలీసులు కాల్చిచంపారు. పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్​ విజయవంతంగా ముగించిన యూపీ పోలీసులను అభినందిస్తూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.10 లక్షలు రివార్డ్ ప్రకటించారు.

UP hostage crisis: All children rescued, accused killed
యూపీ: హత్యకేసు నిందితుడు హతం... చిన్నారులు సురక్షితం

By

Published : Jan 31, 2020, 5:23 AM IST

Updated : Feb 28, 2020, 2:51 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్ కసారియా​లో పోలీసులు చేపట్టిన ఆపరేషన్​ విజయవంతమైంది. 20 మంది చిన్నారులను నిర్బంధించిన ఓ హత్యకేసు నిందితుడు సుభాష్​ బాథమ్​ కాల్పుల్లో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేశారు.

రూ.10 లక్షల రివార్డ్

ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తిచేసిన యూపీ పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అభినందిస్తూ, రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఆపరేషన్​లో పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందించనున్నట్లు యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కె అవస్థీ తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలని...

నిందితుడు సుభాశ్ బాథమ్​ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో నిన్న 20 మందికి పైగా చిన్నారులను నిర్బంధించాడు. అడగడానికి వెళ్లిన గ్రామస్థులపైనా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఓ వ్యక్తి గాయపడ్డాడు.

కొన్ని గంటల తరువాత, ఓ ఆరు నెలల పసికందును మాత్రం బాల్కనీ నుంచి తన పొరుగువారికి అప్పగించాడు. కాసేపటికే దుండగుడ్ని హతమార్చి ఆపరేషన్​ను విజయవంతంగా ముగించారు.

ఇదీ చూడండి:బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు



Last Updated : Feb 28, 2020, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details