తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10మంది టీచర్ల నుంచి రూ.2.32 కోట్లు రికవరీ! - UP govt takes step to recover 2.32 cr from 10 sacked teachers

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరి వేతనం రూపంలో పొందిన రూ.2.36 కోట్లను 10 మంది ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసే చర్యలు ప్రారంభించింది ఉత్తర్​ప్రదేశ్​ సర్కార్​. నగదు తిరిగి చెల్లించాలంటూ వారికి నోటీసులను పంపినట్లు అధికారులు తెలిపారు.

UP govt takes step to recover 2.32 cr from 10 sacked teachers
10 మంది టీచర్ల నుంచి 2.32 కోట్లు రికవరీకి ఆదేశం

By

Published : Jun 10, 2020, 10:44 PM IST

నకలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్లుగా చలామణి అయిన 10 మంది టీచర్లకు చెల్లించిన జీతం, ఇతర అలవెన్స్​ను​ తిరిగి పొందేలా చర్యలు ప్రారంభించింది యూపీ ప్రభుత్వం. మొత్తం 2.36 కోట్ల రూపాయలను చెల్లించాలంటూ వారికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

10మంది ఉపాధ్యాయుల్లో ఆరుగురు సరస్వతి జిల్లాకు చెందిన వారు కాగా.. మరో నలుగురు బహ్రాయిచ్‌ జిల్లా వారని అధికారులు వెల్లడించారు.

నకిలీ పత్రాలను సృష్టించి ఉద్యోగం పొందినట్లు గుర్తించిన ఆరుగురు ఉపాధ్యాయులను గత సంవత్సరమే తొలగించాం. వీరిపై ఎఫ్​ఆర్​ఐ కూడా నమోదు చేశాం. ఈ ఆరుగురిలో ఒకరైన అజిత్​ శుక్లా.. టెట్​కు చెందిన నకిలీ పత్రాలను సృష్టించి ఉద్యోగం సంపాదించినట్లు గుర్తించాం. దీంతో అతడిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశాం. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారు.

-ఓంకార్​ రానా, అధికారి

వీరిలో ఆరుగురికి ..జీతం, ఇతర అలవెన్స్​ల ద్వారా పొందిన 1.37 కోట్ల రూపాయలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు పంపించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని జూన్​ 20 నాటి కల్లా చెల్లించాలని.. లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మిగిలిన నలుగురు ఉపాధ్యాయులు కూడా నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగం పొందినట్లు 2018లోనే గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరికి కూడా రూ.95 లక్షల రూపాయాలను చెల్లించాలని నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మిడతల దండు దాడి చేసినా.. పంట నష్టం జరగలేదు!

ABOUT THE AUTHOR

...view details