తెలంగాణ

telangana

'ప్రతీకారం తీర్చుకుంటాం'- నిరసనకారులకు యోగీ హెచ్చరిక

By

Published : Dec 19, 2019, 9:08 PM IST

Updated : Dec 19, 2019, 11:32 PM IST

పౌరసత్వ చట్ట సవరణపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు. నిరసనకారుల ఆస్తులు వేలం వేసి మరీ నష్టపరిహారాన్ని వసూలు చేస్తామన్నారు.

UP CM warns of strong action against vandals, says will 'auction' their property
'ప్రతీకారం తీర్చుకుంటాం'- నిరసనకారులకు యోగీ హెచ్చరిక

'ప్రతీకారం తీర్చుకుంటాం'- నిరసనకారులకు యోగీ హెచ్చరిక

పౌరసత్వ చట్ట సవరణపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తున్న తరుణంలో.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకుంటామని యోగీ హెచ్చరించారు. నిరసనకారుల ఆస్తులను వేలం వేసి నష్టపరిహారం వసూలు చేస్తామని ప్రకటించారు.

"ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించే ఉద్దేశంతో కాంగ్రెస్, సమాజ్​వాదీ, వామపక్షాలు భారతదేశాన్ని మంటల్లోకి నెట్టేశాయి. లఖ్​నవూ, సంభల్​లో హింసాత్మక నిరసనలు జరిగాయి. వాటిని తీవ్రంగా పరిగణిస్తాం. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన ప్రతీ ఒక్కరి ఆస్తులను జప్తు​ చేస్తాం. నష్టపరిహారం కోసం వాటిని వేలం వేస్తాం. ఆస్తులను ధ్వంసం చేసినవారి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. నిరసనల పేరిట హింసకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదు."-యోగీ ఆదిత్యనాథ్, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి.

నిరసనలపై నవంబర్ 8 నుంచే 144 సెక్షన్ ప్రకారం ఆంక్షలు ఉన్నట్లు యోగీ తెలిపారు. అనుమతులు లేకుండా నిరసన ప్రదర్శనలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్ట సవరణ ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థుల సహాయార్థమే చట్టం రూపొందించారని తెలిపారు.

యూపీకు 'పౌర' సెగ...

దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ఉత్తర్​ప్రదేశ్​లోనూ పౌర చట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. తాజాగా లఖ్​నవూలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. కొన్నిచోట్ల సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆంక్షలను లెక్కచేయకుండా ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు.

Last Updated : Dec 19, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details