తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​'పై ఐరాస భద్రతా మండలిలో చర్చ - ఇండియా

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమయింది. కశ్మీర్ అంశంలో భారత్​ నిర్ణయంపై చర్చ జరగాల్సిందిగా పాక్​, చైనా విన్నపాల మేరకు రహస్య సంప్రదింపులకు అవకాశం ఇచ్చింది ఐరాస.

జమ్ము కశ్మీర్

By

Published : Aug 16, 2019, 8:37 PM IST

Updated : Sep 27, 2019, 5:41 AM IST

జమ్ము కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం ప్రారంభమయింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై అత్యవసరంగా చర్చ జరగాలని ఐరాస భద్రతా మండలికి లేఖ రాసింది పాకిస్థాన్‌.

పాక్​ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా లేఖ రాసింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులు జరుపుతోంది.

ఈ భేటీలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు పాల్గొనగా... భారత్‌, పాకిస్థాన్‌ పాల్గొనలేదు. ఇది కేవలం భారత్, పాక్​ల ద్వైపాక్షిక సమస్య మాత్రమే అని రష్యా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి దిమిట్రీ పోలింస్కీ సమావేశానికి హాజరయే ముందు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్ అంశంలో దౌత్యపరంగా కేంద్రం విఫలం'

Last Updated : Sep 27, 2019, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details