జమ్ము కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం ప్రారంభమయింది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై అత్యవసరంగా చర్చ జరగాలని ఐరాస భద్రతా మండలికి లేఖ రాసింది పాకిస్థాన్.
పాక్ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా లేఖ రాసింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులు జరుపుతోంది.